ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం - అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం

కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అనంతపురం జిల్లా విడపనకల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి.. వాహనాలను సీజ్ చేశారు.

Seizure of smuggled Karnataka liquor
అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం

By

Published : Feb 11, 2021, 1:11 PM IST

కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని, టెట్రా ప్యారెట్లను అనంతపురం జిల్లా విడపనకల్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని బళ్లారి, హగిరి ప్రాంతాల నుంచి అక్రమంగా మద్యం తరలిస్తుండగా.. తనిఖీల్లో పట్టుబడిందని పోలీసులు తెలిపారు. మద్యంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని.. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ఎన్నికల సందర్భంగా కర్ణాటక మద్యం ఎక్కువగా తరలిస్తున్నారని.. ప్రతి వాహనం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సర్కిల్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేస్తామని విడపనకల్ ఎస్ఐ గోపి తెలిపారు.

ఇదీ చదవండి: నేటి నుంచి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు

ABOUT THE AUTHOR

...view details