ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 4, 2020, 11:49 PM IST

ETV Bharat / state

కర్ణాటక మద్యం పట్టివేత... మూడు వాహనాలు సీజ్

కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తులను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 363 మద్యం ప్యాకెట్లు, 32 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని మూడు ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు.

seized karnatka liquor  in anantapur dst
seized karnatka liquor in anantapur dst

అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్ మండలాల్లో కర్ణాటక సరిహద్దు హావాలిగి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బళ్లారి నుంచి హావాలిగి పొలాల వెంట అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 363 మద్యం ప్యాకెట్లు, 32 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని మూడు ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details