అనంతపురం జిల్లా చిలమత్తూరు మండల కేంద్రంలోని సచివాలయం - 2 సిబ్బంది పింఛన్ పంపిణీలో చేతివాటం ప్రదర్శించారు. కొత్త పింఛన్ పుస్తకాలు ఇవ్వాలంటే వెయ్యి రూపాయల ఇవ్వాలని లబ్ధిదారులకు తెలిపారు. పింఛన్ పంచే సమయంలో... వెయ్యి రూపాయలు కోత విధించి 1500 రూపాయలు మాత్రమే చెల్లించారు. స్థానికులు ఈ దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం... చేతివాటం ప్రదర్శించిన సచివాలయం సిబ్బందిపై వేటు వేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
సచివాలయ సిబ్బంది చేతివాటం.. పింఛన్లో వెయ్యి రూపాయల కోత! - pensions
కొత్తగా మంజూరైన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించారు. పింఛన్ పుస్తకాన్ని అందించాలంటే 1000 రూపాయలు చెల్లించాలంటూ లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా చిలమత్తూరులో చోటుచేసుకుంది.
సచివాలయ సబ్బంది చేతివాటం.. పింఛన్లో వెయ్యి రూపాయల కోత!