ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై దాడులు.. వేల లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం - natu sara at prakasham district latest news

మద్యం అక్రమ రవాణా, నాటు సారాపై సెబ్ ఉక్కుపాదం మోపుతోంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నాటు సారా స్థావరాలపై అధికారులు దాడులు నిర్వహించారు. వేల లీటర్ల బెల్లం ఊటలను ధ్వసం చేశారు. సారా తయారు చేసేవారిని అదుపులోకి తీసుకున్నారు.

seb attack on natu sara at ananthapur district
seb attack on natu sara at ananthapur district

By

Published : Nov 23, 2020, 7:24 AM IST

అనంతపురం జిల్లాలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్​మెంటు బ్యురో (సెబ్‌) బృందాలు ఆదివారం ముమ్మరంగా దాడులు నిర్వహించాయి. 3,500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. 20 మందిని అరెస్టు చేశారు. 97 లీటర్ల సారా, 77 టెట్రా ప్యాకెట్లు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు సెబ్‌ ప్రత్యేకాధికారి రామ్మోహన్‌రావు ఆధ్వర్యంలో దాడులు సాగాయి.

వజ్రకరూరు మండలం, తనకల్లు మండలంలోనూ పోలీసులు దాడులు నిర్వహించారు. తండాలు, పరిసర ప్రాంతాలు, పొలాలు, అటవీ భూములు, గడ్డివాములు, పశువుల పాకలు, సరిహద్దు రహదారుల్లో ఈ తనిఖీలు చేశారు. రూ.30 వేలు విలువ చేసే టపాసులు, రూ.27,903 విలువ చేసే గుట్కా ప్యాకెట్లు, రూ.11,160 నగదు, నాటు సారా తయారీకి వినియోగించే 110 కిలోల బెల్లం, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

ప్రకాశం జిల్లాలో...

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని అటవీ ప్రాంతంలో నాటు సారా స్థావరాలపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్​మెంటు బ్యురో అధికారులు దాడులు నిర్వహించారు. ఎల్లారెడ్డి గ్రామ అటవీ ప్రాంతంలో నాటు సారా తయారు చేయడానికి సిద్ధంగా ఉంచిన 2800 లీటర్ల బెల్లం ఉటను ధ్వంసం చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని, 40 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:

కర్నూలులో విమానాల మరమ్మతు కేంద్రం

ABOUT THE AUTHOR

...view details