ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధ్యాయుడి కీచక పర్వం..వెలుగులోకి ఆడియో.. పోక్సో కేసు నమోదు - ఉపాధ్యాయుడి వేధింపులు

Sexual Harassment: పాఠాలు చెప్పాల్సిన గురువే.. పాడు పని చేశాడు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడు బాలికపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. బుద్ది గడ్డి కరిచి పాఠాలు కాకుండా సరసాలు మొదలుపెట్టాడు. తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురి చేశాడు. వేధింపుల ఘటనలో టీచర్‌పై పోక్సో కేసు నమోదైంది.

ఉపాధ్యాయుడి కీచక పర్వం
ఉపాధ్యాయుడి కీచక పర్వం

By

Published : Feb 14, 2022, 4:28 PM IST

Updated : Feb 14, 2022, 10:32 PM IST

ఉపాధ్యాయుడి కీచక పర్వం

Teacher Sexual Harassment:బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన టీచర్ విద్యార్థిని పట్ల వికృతంగా ప్రవర్తించాడు. బాలికకు పాఠాలు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే నీచమైన పనికి దిగజారాడు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం శ్రీధరగట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి పైశాచిక ఆనందాన్ని పొందాడు. విద్యార్థిని ఇంట్లో ఉన్న మొబైల్​కు ప్రతి రోజు ఫోన్​, చాటింగ్ చేస్తూ విద్యార్థినితో వికృతంగా ప్రవర్తిస్తున్నాడు. తన భార్యకు ఏడాదిగా ఆరోగ్యం బాగాలేదని.. పడక సుఖానికి పనికిరాదని తన కోరిక తీర్చాలంటూ వాయిస్ మేసెజ్​లు పంపించి వేధింపులకు గురి చేస్తున్నాడు. దైవంగా భావించే గురువే.. రాక్షసుడిగా మారటంతో ఏం చేయాలో తెలియక, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆ విద్యార్థిని మానసికక్షోభకు గురైంది.

విషయం ఇలా బయటపడింది..

ఓ రోజు విద్యార్థిని ఇంట్లోలేని సమయంలో ఉపాధ్యాయుడు ఫోన్ చేశాడు. కుటుంబ సభ్యులు ఫోన్ లిప్ట్ చేయగా..అవతలి వైపు ఎవరు ఫోన్ లిప్ట్​ చేశారో తెలియకుండానే ఉపాధ్యాయుడు తన కామ పురణాన్ని మెుదలుపెట్టాడు. అది విన్న విద్యార్థిని తల్లిదండ్రులు.. షాక్​కు గురయ్యారు. దీంతో ఉపాధ్యాయుడిని నిలదీసేందుకు పాఠశాలకు వెళ్లగా..అతను సెలవులో ఉన్నాడని ప్రధానోపాధ్యాయుడు వెల్లడించారు.

విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారులు ఘటనపై విచారణకు ఆదేశించారు. కాగా.. కీచక ఉపాధ్యాయుడి తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

టీచర్‌పై పోక్సో కేసు...

బాలికపై వేధింపుల ఘటనలో టీచర్‌పై పోక్సో కేసు నమోదైంది. ఓబులేసుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఫోనులో అసభ్యంగా మాట్లాడుతూ బాలికను వేధించినట్లు ఆరోపణలు రావటంతో అధికారులు విచారణ జరిపారు. నివేదిక ఆధారంగా ఓబులేసును సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి

పెళ్లితో ఒక్కటైన ట్రాన్స్​జెండర్ల జంట- ఇలా దేశంలోనే తొలిసారి!

Last Updated : Feb 14, 2022, 10:32 PM IST

ABOUT THE AUTHOR

...view details