ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జోగిని వ్యవస్థను రూపుమాపాలంటూ.. ఎస్సీ సంక్షేమ సంఘం ర్యాలీ - జోగిని వ్యవస్థపై ఎస్సీ సంక్షేమ సంఘం ర్యాలీ తాజా వార్తలు

అనంతపురం జిల్లాలో ఉన్న జోగిని, మాతంగి, బసివిని సమస్యలను పరిష్కరించాలని, ఆ వ్యవస్థను రూపుమాపాలని ఎస్సీ సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ర్యాలీ చేశారు.

SC welfare society rally on Jogini problems
జోగిని వ్యవస్థను రూపుమాపాలని ఎస్సీ సంక్షేమ సంఘం ర్యాలీ

By

Published : Mar 22, 2021, 5:33 PM IST

జోగిని, మాతంగి, బసివిని సమస్యలను పరిష్కరించాలని, ఆ వ్యవస్థను నిర్మూలించాలని ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ సర్కిల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు.

జిల్లాలో జోగిని వ్యవస్థను రూపుమాపాలని, ప్రస్తుతం ఉన్న జోగిని, మాతంగి, బసివినిలకు పింఛన్ సౌకర్యం కల్పించి, సొంత ఇంటిని నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details