ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుట్టపర్తిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం - పుట్టపర్తిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు

సామాజిక దూరం పాటించటం ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా పట్టణంలోని అన్ని వీధుల్లో రసాయన ద్రావణాన్ని పిచికారి చేయించారు.

పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం
పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం

By

Published : Apr 5, 2020, 11:50 AM IST

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కరోనా నివారణ చర్యలు చేపట్టారు. పట్టణంలోని అన్ని వీధుల్లో రసాయన ద్రావణాన్ని పిచికారి చేశారు. నియోజకవర్గంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. సామాజిక దూరం పాటించటం ద్వారానే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని ప్రజలకు పిలుపునిచ్చారు. లాక్​డౌన్ నిబంధనలు ఎవరూ అతిక్రమించవద్దని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details