అనంతపురంలో పారిశుద్ధ్య కార్మికులు వినూత్న తరహాలో నిరసన తెలిపారు. తమకు పనిముట్లు ఇవ్వాలని నగరంలోని కోర్టు రోడ్డు ట్యాంకు సర్కిల్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులుఆందోళన చేశారు. పురుషులు ట్యాంక్ ఎక్కి నిరసన తెలపగా.. మహిళా కార్మికులు పరకలు చూపుతూ ప్రదర్శన చేశారు. చాలీచాలని పనిముట్లతో ఏళ్లుగా నెట్టుకొస్తున్నామని, ఇప్పటికైనా సరైన పనిముట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
పనిముట్లు ఇవ్వాలంటూ పారిశుద్ధ్య కార్మికులు నిరసన - ananthapur town latest news
పారిశుద్ధ్య కార్మికులకు పనిముట్లు ఇవ్వాలని అనంతపురంలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పురుషులు ట్యాంకు ఎక్కి నిరసన తెలపగా... మహిళా కార్మికులు పరకలు చూపుతూ ప్రదర్శన చేశారు.
![పనిముట్లు ఇవ్వాలంటూ పారిశుద్ధ్య కార్మికులు నిరసన sanitary workers protest at ananthapur town to give sufficient items for cleaning purpose](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7696248-366-7696248-1592648635375.jpg)
అనంతపురంలో ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన పారిశుద్ద్య కార్మికులు