ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 18, 2020, 12:31 PM IST

ETV Bharat / state

'భరోసా కేంద్రాలతో రైతులకు అండ'

రైతులకు అన్ని వేళలా అండగా ఉంటామని అనంతపురం జిల్లా అధికారులు హామీ ఇచ్చారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని రకాల సేవలు అందించబోతున్నట్టు చెప్పారు.

rythu bharosa
rythu bharosa

రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని రకాల సేవలకు భరోసా కల్పిస్తున్నామని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురద కుంట గ్రామంలో వేరుశెనగ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను గ్రామస్తులకు వివరించారు. ఎటువంటి సమస్య వచ్చినా అన్ని వేళలా అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. తమ దృష్టికి సమస్యలను తప్పనిసరిగా తీసుకురావాలని కోరారు. అనంతరం రైతులకు చెక్కులు అందించారు.

ABOUT THE AUTHOR

...view details