RTC REGIONAL CHAIRMAN : అనంతపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వైసీపీ నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ మంజుల కన్నీటి పర్యంతమయ్యారు. సభ పైకి తనను పిలవలేదనే ఆందోళనతో కన్నీరు పెట్టుకున్నారు. ఛైర్మన్ అయిన తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో ఆవేదన చెందారు. పార్టీ కోసం పని చేస్తున్న వారిని, పదవిలో ఉన్న నాయకులను గుర్తించకపోవడం ఏంటని ఆమె తరఫు కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఆమె కన్నీటి పర్యంతం అవుతున్న విషయాన్ని గమనించిన కొంతమంది నాయకులు సర్దిచెప్పి సభ పైకి తీసుకెళ్లారు.
వైసీపీ నియోజకవర్గస్థాయి సమావేశం..కంటతడి పెట్టిన ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ మంజుల
RTC REGIONAL CHAIRMAN CRIED : అనంతపురంలో నిర్వహించిన వైసీపీ నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ మంజుల కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ కోసం పని చేస్తున్న వారిని, పదవిలో ఉన్న నాయకులను గుర్తించకపోవడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.
![వైసీపీ నియోజకవర్గస్థాయి సమావేశం..కంటతడి పెట్టిన ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ మంజుల RTC REGIONAL CHAIRMAN CRIED](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17181815-918-17181815-1670829827427.jpg)
RTC REGIONAL CHAIRMAN CRIED