అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతపురం నగరానికి చెందిన ఇద్దరు రాజస్థాన్ వాసులు ద్విచక్ర వాహనంపై కదిరికి వెళ్తుండగా స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.