ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 19, 2020, 9:14 AM IST

ETV Bharat / state

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదం.. వ్యక్తి మృతి

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగిన ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఈ ఘటన జరిగింది.

road accident in anantapuram
ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

అనంతపురం జిల్లా ధర్మవరం ఇందిరమ్మ కాలనీ వద్ద సోమవారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

రామాంజనేయులు (41) వ్యవసాయతోట వద్దకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ అతను సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. పట్టణ సీఐ కరుణాకర్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details