అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి 44వ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జవ్వగా... లోపల ఉన్న వారిని స్థానికులు ఎంతో కష్టపడి బయటకు తీశారు. బెంగుళూరు నుంచి గుల్బర్గా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా యోగిత పూజారి(40) చనిపోయారు. మిగతా ముగ్గురు ప్రయాణికులైన కాంచన్ పూజారి, నితిన్ పూజారి, ప్రథమేష్ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి
అనంతపురం జిల్లా 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయిన కారు