ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూలీల ఆటో బోల్తా.. మహిళ మృతి.. ఐదుగురి పరిస్థితి విషమం - గుంతకల్లు రోడ్డుప్రమాదంలో మహిళ మృతి వార్తలు

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులోని జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొనకొండ్ల సమీపంలో కూలీల ఆటో బోల్తా పడగా మహిళ మృతి చెందింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

కూలీల ఆటో బోల్తా.. మహిళా మృతి.. ఐదుగురి పరిస్థితి విషమం
కూలీల ఆటో బోల్తా.. మహిళా మృతి.. ఐదుగురి పరిస్థితి విషమం

By

Published : Jan 17, 2021, 8:13 AM IST

కూలీల ఆటో బోల్తా.. మహిళా మృతి.. ఐదుగురి పరిస్థితి విషమం

వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామానికి చెందిన 18 మంది కూలీలు పప్పు శనగ పంటను తొలగించడానికి ఆటోలో కర్నూలు జిల్లాలోని గుమ్మనూరు గ్రామానికి వెళ్తున్నారు. మార్గ మధ్యలో జాతీయ రహదారి పనులు జరుగుతున్న కారణంగా... రహదారికి అడ్డంగా మట్టి కుప్పలు వేశారు. ఆటో డ్రైవర్ గమనించక.. మట్టికుప్ప పైకి వాహనాన్ని ఎక్కించాడు.

వేగంగా వెళ్తున్న కారణంగా.. ఆటో 3 సార్లు పల్టీలు కొట్టి పడిపోయింది. కూలీలపై వాహనం పడిన కారణంగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో రమణమ్మ (35) అనే మహిళ మృతి చెందింది. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని కర్నూలుకు తరలించారు. మరో 12 మందిని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను గుంతకల్లు డీఎస్పీ షర్పుద్దీన్ పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details