ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హాజీపురం సమీపంలో రోడ్డు ప్రమాదం...ఒకరు మృతి - పెనుకొండలో రోడ్డు ప్రమాదం

పెనుకొండ మండలం హాజిపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుకొండ కూడలి వద్ద బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్​ను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు.

road accident
హాజీపురం సమీపంలో రోడ్డు ప్రమాదం...ఒకరు మృతి

By

Published : Jun 27, 2020, 6:14 PM IST

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుకొండ మండలంలోని హాజిపురం సమీపంలో 44వ జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ మృతి చెందాడు.

బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్​ను పెనుకొండ కూడలి వద్దకు రాగానే బొలెరో వాహనం ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న జాతీయ రహదారి నిర్వహణ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వాహనాలను రోడ్డు మీద నుంచి పక్కకు జరిపించారు. పోలీసులు కేసు నమోదు చేసి..మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details