ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో రోడ్డు ప్రమాదం...20 మందికి గాయాలు - అనంతపురం రోడ్డు ప్రమాదంలో 20 మందికి గాయాలు

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చందిన 20 మందికి పైగా గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను అనంతపురం,కర్నూలు జిల్లాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అనంతపురం రోడ్డు ప్రమాదంలో 20 మందికి గాయాలు

By

Published : Nov 3, 2019, 8:16 PM IST

అనంతపురం రోడ్డు ప్రమాదంలో 20 మందికి గాయాలు

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పామిడి పట్టణానికి చెందిన రాజన్న కుటుంబ సమేతంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామిని దర్శించుకుని.. తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గుంతకల్లు మండలం వెంకటాంపల్లి గ్రామం వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న స్కూటర్​ను తప్పించబోయి.. డ్రైవర్ బ్రేకులు వేయటంతో వేగంగా ఉన్న ట్రాక్టర్ ఒక్కసారిగా ఒక వైపునకు ఓరిగి బోల్తాపడింది. ప్రమాదంలో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details