ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదును చూసి జైలు నుంచి పరారయ్యాడు - అనంతపురం జైలు నుంచి పరారైన రిమాండ్ ఖైదీ

అనంతపురం జిల్లాలో జైలులో నుంచి రిమాండ్​ ఖైది పరారయ్యాడు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పరారైనట్లు జైలు సూపరింటెండెంట్ సత్యనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

remand prisoner escaped from ananthapur jail
జైలు నుంచి పరారైన రిమాండ్ ఖైదీ

By

Published : Mar 20, 2020, 11:21 PM IST

అదును చూసి జైలు నుంచి పరారయ్యాడు

అనంతపురం జిల్లా జైలు నుంచి రిమాండ్​ ఖైది పరారు కావడం సంచలనం సృష్టిస్తోంది. ఒక ప్రమాద కేసులో ఎర్రస్వామి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. అధికారులెవ్వరు సమీపంలో లేరని గమనించిన ఎర్రస్వామి పరారయ్యాడు. జైలు అధికారుల నిర్లక్ష్యం వల్లే నిందితుడు పరారయ్యాడని సూపరింటెండెంట్ సత్యనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. పరారీలో ఉన్న ఎర్రస్వామి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ఇదీ చదవండి:బురదలో కూరుకుపోయి వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details