ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనంతలో ఘనంగా రంజాన్ వేడుకలు

By

Published : May 14, 2021, 11:10 AM IST

పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు అనంతపురంలో ఘనంగా చేసుకుంటున్నారు. కరోనా మహమ్మారి అంతమవ్వాలని ఆ దేవుణ్ని ప్రార్థించారు.

Ramzan celebrations in Ananthapuram
Ramzan celebrations in Ananthapuram

అనంతపురంలో రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. నగరంలోని మడిమి వంక వద్ద ఉన్న చాందిని మసీద్​లో కొవిడ్ నిబంధనల మేరకు ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని.. కరోనా మహమ్మారి అంతమవ్వాలని.. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆ దేవుణ్ని కోరుకున్నట్లు ముస్లిం సోదరులు తెలిపారు. సేవా భావానికి ప్రతీక అయినా రంజాన్ పండుగను ప్రతి ముస్లిం సంతోషంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details