ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ దేవాలయం కోసమే పీసీసీ పదవికి రఘువీరారెడ్డి రాజీనామా' - pcc raghuveera reddy news in anantha puram

దేవాలయం నిర్మాణం రఘువీరా కుటుంబీకుల కోరిక అని... అందుకోసం సమయాన్ని కేటాయించాలని ఆయన పీసీసీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తెలిపారు.

మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్
మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్

By

Published : Jan 17, 2020, 9:29 PM IST

Updated : Jan 17, 2020, 9:38 PM IST

మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్
కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి...గత ఐదు ఏళ్లుగా పార్టీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అన్నారు. దేవాలయం నిర్మాణం రఘువీరా కుటుంబీకుల కోరిక అని... అందుకోసమే ఆయన పీసీసీ పదవికి రాజీనామా చేయాల్సివచ్చిందని సుధాకర్ తెలిపారు. ఆలయ నిర్మాణ పనుల్లో సమయం కేటాయించేందుకు పీసీసీ పదవి రాజీనామా పత్రాన్ని ఆమోదించాలని అధిష్ఠానాన్ని కోరారన్నారు. సోనియా గాంధీ మొదట ఆయన నిర్ణయాన్ని ఒప్పుకోలేదని, ఎట్టేకేలకు తిరిగి ఆమోదించారని మాజీ ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్​గా నియమితులైన.. సాకె శైలజానాథ్​కు అభినందలు తెలిపారు. తామంతా కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపారు.

ఇవీచదవండి

Last Updated : Jan 17, 2020, 9:38 PM IST

ABOUT THE AUTHOR

...view details