ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కలెక్టర్​కు శానిటైజర్లు, పీపీఈ కిట్లు అందించిన వైకాపా నేత

కరోనా వ్యాప్తిపై పోరు సాగిస్తోన్న వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి పలువురు ప్రజా ప్రతినిధులు అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ వైకాపా ఇంఛార్జీ నవీన్ నిశ్చల్ రూ.30 లక్షల విలువైన పీపీఈ కిట్లు, శానిటైజర్లను జిల్లా కలెక్టర్​కు అందజేశారు.

By

Published : May 4, 2020, 11:10 PM IST

Published : May 4, 2020, 11:10 PM IST

శానిటైజర్లు, పీపీఈ కిట్లు అందజేత
శానిటైజర్లు, పీపీఈ కిట్లు అందజేత

అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ వైకాపా ఇంఛార్జీ నవీన్ నిశ్చల్ రూ.30 లక్షల విలువైన పీపీఈ కిట్ల, శానిటైజర్లను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకు అందజేశారు. కొవిడ్-19 వైరస్ నివారణ చర్యల కోసం అహర్నిశలు కష్టపడుతున్న వైద్య, పారిశుద్ధ్య, పోలీస్ సిబ్బందికి ఈ కిట్లను అందజేయాలని ఆయన కలెక్టర్​ను కోరారు. వారికి ఎలాంటి సహాయం కావాలన్నా.. అందించడానికి సాయి ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ముందుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా నవీన్ నిశ్చల్​కి జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details