ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 27, 2021, 6:40 AM IST

ETV Bharat / state

పశువులను అక్రమంగా తరలిస్తున్న లారీ పట్టివేత

పశువులను అక్రమంగా తరలిస్తున్న లారీని అనంతపురం జిల్లా విడపనకల్లు పోలీసులు పట్టుకున్నారు. కోర్టు ఆదేశానుసారం పశువులను గోశాలకు తరలిస్తామని ఎస్సై తెలిపారు.

Police seize lorry transporting cattle illegally in Vidapanakallu, Anantapur district
పశువులను అక్రమంగా తరలిస్తున్న లారీ పట్టివేత

నిబంధనలకు విరుద్ధంగా పశువులను అక్రమంగా తరలిస్తున్న లారీని అనంతపురం జిల్లా విడపనకల్లు పోలీసులు పట్టుకున్నారు. కర్నాటకకు చెందిన పశువుల వ్యాపారి 11 ఎద్దులు, 3 దూడలు, ఒక గేదెను లారీలో అనంతపురానికి తరలిస్తుండగా అడ్డుకున్నారు.

విడపనకల్లు వద్ద 42 వ జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా.. ఈ వ్యవహారం బయటపడింది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. న్యాయస్థానం ఆదేశానుసారం పశువులను గోశాలకు తరలిస్తామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details