ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జోగిని వ్యవస్థ నుంచి ఇద్దరు చిన్నారులను కాపాడిన పోలీసులు - రాయదుర్గంలో జోగిని వ్యవస్థ

తోటి చిన్నారులతో ఆడి పాడాల్సిన వారి బాల్యాన్ని.. కొందరు అర్ధంతరంగా ముగించేస్తున్నారు. అభం, శుభం ఎరుగని పసిపిల్లల జీవితాలను ఆచారాల పేరుతో నాశనం చేస్తున్నారు. పెళ్లి అనే పదానికి అర్థం తెలియని వయస్సులో.. 'దేవునితో నీ పెళ్లి అయిపోయింది' అని నూరిపోస్తూ.. వారి నూరేళ్ల జీవితాన్ని శాసిస్తున్నారు. ఈ సమాజం అలాంటి వారికి పెట్టుకున్న అందమైన పేరు జోగిని. ఈ మూఢచారంపై ప్రభుత్వం ఎన్నో అవగాహనలు కల్పిస్తున్నా.. కొన్ని చోట్ల నేటికీ పునరావృతం అవుతూనే ఉన్నాయి. అలాంటి ఈ వ్యవస్థకు బలౌతున్న ఓ ఇద్దరు చిన్నారులకు విముక్తి కల్పించారు పోలీసులు.

Police rescue two children
జోగిని వ్యవస్థ నుంచి ఇద్దరు చిన్నారులను కాపాడిన పోలీసులు

By

Published : Mar 30, 2021, 9:15 PM IST

మాట్లాడుతున్న సీఐ

కర్ణాటక సరిహద్దుల్లో జోగిని, దేవదాసి వ్యవస్థల పేరిట నేటికీ చిన్నారుల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సాంప్రదాయం అనంతపురం జిల్లాలో ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లోని ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన ప్రజలను పట్టి పీడిస్తోంది. రాయదుర్గం నియోజకవర్గంలోని డీహీరేహాళ్, బొమ్మనహాళ్ మండలాల్లో.. ఇద్దరు చిన్నారులను జోగినులుగా మార్చేందుకు జరిగిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ బాలికలను రక్షించారు.

సీఐ రాజా, ఎస్సైలు, పోలీసు సిబ్బంది, ఇతర ప్రభుత్వ అధికారులు, సంయుక్తంగా ఆయా గ్రామాలకు వెళ్లి ఈ ఘటనను అడ్డుకున్నారు. వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇప్పించి అమ్మాయిలకు విముక్తి కల్పించారు. వీరిలో ఒకరిని అనంతపురం బాల సదన్​కు... మరొకరిని ఆ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువు నిమిత్తం చేర్పించేలా సంబంధిత అధికారులతో మాట్లాడారు.

ABOUT THE AUTHOR

...view details