ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో 25 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్ - Anantapur district latestnews

పేకాట స్థావరాలపై అనంతపురం నగరంలో పోలీసులు దాడులు నిర్వహించారు. 25 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Police raid poker sites in Anantapur
అనంతపురంలో 25 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్

By

Published : Jan 22, 2021, 11:12 AM IST

అనంతపురం నగరంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నగరంలోని 5వ రోడ్డులో జూదం ఆడుతున్నారని సమాచారం అందినమేరకు.. సెబ్ పోలీసులు, మూడో పట్టణ పోలీసులు దాడులు జరిపారు.

25 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 4 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు. ఇలాంటి చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్​కు పంపుతున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details