ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్యాన్సర్​పై అవగాహనకు పోలీసుల కవాతు...

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో క్యాన్సర్​పై అవగాహన కార్యక్రమం జరిగింది. కవాతుతో పాటు ర్యాలీ నిర్వహించారు.

By

Published : Oct 10, 2020, 2:42 PM IST

police parade
అనంతపురంలో పోలీసుల కవాతు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ విగ్రహం వరకు కవాతు చేశారు. నియోజకవర్గంలోని మహిళా కానిస్టేబుళ్లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి సామాజిక మాధ్యమాల్లో ఎంతో ఆదరణ లభించిందని డీఎస్పీ అన్నారు. మహిళలు ఎక్కువగా క్యాన్సర్​ బారిన పడుతున్నారని..ముందస్తు జాగ్రత్తలతో వ్యాధిని నివారించవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి: 'రాజధాని మార్పునకు ఒక్క కారణమైనా చెప్పగలరా?'

ABOUT THE AUTHOR

...view details