ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి'

కోవిడ్​-19 (కరోనా వైరస్) వ్యాప్తి చెందకుండా అప్రమత్తం కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు అనంతపురంలో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈనెల 31 వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకూడదని పోలీసులు కోరారు.

By

Published : Mar 23, 2020, 6:27 PM IST

అనంతపురంలో వాహనదారులను అప్రమత్తం చేస్తున్న పోలీసులు
అనంతపురంలో వాహనదారులను అప్రమత్తం చేస్తున్న పోలీసులు

అనంతపురంలో వాహనదారులను అప్రమత్తం చేస్తున్న పోలీసులు
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు అనంతపురంలో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈనెల 31 వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకూడదనే నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. కొంతమంది వినకుండా ఆటోలలో, కార్లలో ప్రయాణిస్తుండడంతో వారిని పోలీసులు హెచ్చరించారు. మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను అప్రమత్తం చేశారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు గమనించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో కరోనా అప్​డేట్స్ : ఆరుగురికి పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details