ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్న అధికారులు

కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను డోనేకల్, విడపనకల్ చెక్ పోస్టుల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్రవాహనాన్ని సీజ్​ చేశారు.

By

Published : Jun 4, 2020, 1:16 AM IST

police cought ilegal karnataka liquore
అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు

అనంతపురం జిల్లా ​పరిధిలో కర్ణాటక సరిహద్దుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను విడపనకల్, డోనేకల్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. నిందితులపై కేసులు నమోదు చేశారు. ఎవరైనా మద్యం అక్రమంగా తరలిస్తే ఊరుకునేది లేదని.. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details