ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలీసు అమరుల సేవలు ఎన్నడూ మరవకూడదు' - అనంతపురంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం వార్తలు

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా అనంతపురంలో డీఐజీ కాంతి రాణా టాటా, ఎస్పీ సత్య ఏసుబాబు పోలీసుల స్థూపానికి నివాళులర్పించారు. జిల్లా వ్యాప్తంగా 822 మంది పోలీసులు కొవిడ్​ పాజిటివ్ బారిన పడినట్లు తెలిపారు. వీరిలో ఐదుగురు మరణించారన్నారు.

police-commemoration-day-in-ananthapuram
పోలీసు అమరవీరులకు నివాళులు

By

Published : Oct 21, 2020, 2:04 PM IST

Updated : Oct 21, 2020, 4:07 PM IST

కొవిడ్​కు భయపడకుండా ప్రతి ఒక్క పోలీసు విధుల్లో మెరుగైన ప్రతిభ కనబరిచారని డీఐజీ కాంతి రాణా చెప్పారు. ఆపద కాలంలో కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించారని గుర్తుచేశారు.

అమరులైన పోలీసుల సేవలు ఎన్నటికీ మరువకూడదన్నారు. అమరులైన వారి కుటుంబాలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

Last Updated : Oct 21, 2020, 4:07 PM IST

ABOUT THE AUTHOR

...view details