రాష్ట్ర వ్యాప్తంగా.. పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం చేపట్టారు. వీధి బాలలను, బాలకార్మికులను గుర్తించి.. వారికి విముక్తి కల్పించారు.
కర్నూలు జిల్లా ...
కర్నూలు జిల్లా వ్యాప్తంగా 340 మంది చిన్నారులను పోలీసులు గుర్తించారు. వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ. డాక్టర్.ఫక్కీరప్ప తెలిపారు.
కడప జిల్లా ...
కడప జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా 493 మంది పిల్లలను పోలీసులు గుర్తించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ కోరారు.
అనంతపురం జిల్లా...
అనంతపురం జిల్లాలో దుకాణాల్లో పని చేస్తున్న 69 మంది బాలకార్మికులను గుర్తించి సంరక్షణా గృహాలకు తరలించారు. అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో బాలకార్మికుల తల్లిదండ్రులతో ఎస్పీ సత్యఏసు బాబు సమావేశం నిర్వహించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలన్నారు. 'రెస్క్యు బాలలకు దుస్తులు, సురక్షిత ఉపకరణలు, బిస్కెట్లు పంపిణీ చేశారు.
చిత్తూరు జిల్లా...
చిత్తూరు జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా పోలీసులు... బస్టాండ్లు, రైల్వే స్టేషన్, హోటళ్లలో, కర్మాగారాలలో మగ్గుతున్న 52 మంది చిన్నారులను గుర్తించారు. సదరు బాలబాలికలను వారి తల్లి దండ్రులు, బందు మిత్రులను, రక్త సంబందికులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలకు అప్పగించారు.
ప్రకాశం జిల్లా ..
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 80 మంది చిన్నారులను పోలీసులు అదుపులోకి తీసుకొని... వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అనంతరం శానిటైజర్లతో బాలబాలికల చేతులను శుభ్రంగా కడిగి అల్పాహారాన్ని అందించారు.