మహాత్మా గాంధీ కలలను నిజం చేసేందుకు భాజపా కృతనిశ్చయంతోముందుకు సాగుతోందని భాజపా నేతలు ప్రకటించారు.అనంతపురం జిల్లా కదిరిలో ప్రారంభం కానున్న గాంధీ సంకల్ప యాత్రను ప్రజలు విజయవంతం చేయాలని వారు కోరారు.శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయము నుంచి ప్రారంభమయ్యే సంకల్ప యాత్ర జిల్లాలో పదిహేను రోజులపాటు కొనసాగుతుందన్నారు.సంకల్ప యాత్రలో గాంధీజీ పిలుపునిచ్చిన విధంగా చివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలను అందేలా ప్రజలను జాగృతం చేస్తామన్నారు.
'గాంధీ సంకల్పయాత్రను విజయవంతం చేయండి' - 'గాంధీ సంకల్పయాత్రను విజయవంతం చేయండి'
అనంతపురం జిల్లా కదిరిలో ప్రారంభం కానున్న గాంధీ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు ప్రజలను కోరారు.

గాంధీ సంకల్పయాత్ర