ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీస్ స్టేషన్ ఎదుట పురుగులమందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

సీజ్ చేసిన తన బైక్ ఇవ్వాలంటూ పోలీస్ స్టేషన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన.. అనంతపురం జిల్లా కూడేరులో జరిగింది. అతన్ని పోలీసులు ఆసుపత్రిలో చేర్పించి.. జరిగిన ఘటనపై కేసు నమోదు చేశారు.

By

Published : Jun 29, 2020, 2:17 PM IST

person suicide attempt infront of police station in kuderu ananthapuram dsitrict
కూడేరు పోలీస్ స్టేషన్

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు పోలీస్ స్టేషన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎస్సై యువరాజు తెలిపిన వివరాల ప్రకారం.. జయరామ్ అనే వ్యక్తి నాటుసారా రవాణా చేస్తూ కొన్ని రోజుల కిందట పోలీసులకు చిక్కాడు. అతనిపై కేసు నమోదు చేసి ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఆదివారం రాత్రి అతను స్టేషన్​కు వచ్చి తన బైక్ ఇవ్వాలని కానిస్టేబుల్​ను బెదిరించాడు. కుదరదు అని చెప్పటంతో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details