చెరువులో చేపల వేటకు వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. మృతుడు గుత్తి పట్టణం అంబేడ్కర్ కాలనీకి చెందిన రమేష్గా స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన రమేష్ మృతదేహం ఒడ్డున ఉండటం వల్ల పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చేపల వేటకు వెళ్లిన యువకుడు అనుమానాస్పద మృతి - గుత్తిలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
గుత్తిలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన రమేష్ అనే యువకుడు చెరువులో చేపల వేటకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చెరుపు వద్ద అనుమానాస్పదంగా మృతి చెందిన రమేష్