ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 11, 2020, 8:40 PM IST

ETV Bharat / state

చేపల వేటకు వెళ్లిన యువకుడు అనుమానాస్పద మృతి

గుత్తిలోని అంబేడ్కర్​ కాలనీకి చెందిన రమేష్​ అనే యువకుడు చెరువులో చేపల వేటకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

person died in a suspected way at gutti in ananthapur district
చెరుపు వద్ద అనుమానాస్పదంగా మృతి చెందిన రమేష్​

చెరువులో చేపల వేటకు వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. మృతుడు గుత్తి పట్టణం అంబేడ్కర్​ కాలనీకి చెందిన రమేష్​గా స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన రమేష్​ మృతదేహం ఒడ్డున ఉండటం వల్ల పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details