ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 3, 2020, 6:27 PM IST

ETV Bharat / state

అధికారుల్లో కరోనా భయం... ప్రజలకు పట్టని వైనం

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా... ప్రజల్లో ఏ మాత్రం భయం కనిపించడంలేదు. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద గుంపులుగా ఉంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని ప్రజల తీరు ఆందోళనకరంగా ఉంది.

people don't follow the corona rules in vuravakonda, ananthapur district
అధికారుల్లో కరోనా భయం... ప్రజలకు పట్టని వైనం

అనంతపురం జిల్లా ఉరవకొండలోని ప్రజలు కరోనా నిబంధనలు పాటించడం లేదు. నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. రుణాల కోసం వచ్చిన జనం... బ్యాంకు వద్ద గుమిగూడారు.

అధికారులు మొత్తుకొని.. లైన్లో నిలబెట్టినా... వారి దారి వారిదే అన్నట్టు వ్యవహరించారు. ఎవరి నుంచైనా కరోనా వస్తే పరిస్థితి ఏంటని బ్యాంకు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు.. తమకు సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details