కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరిగిపోతున్నా కొంతమంది నిర్లక్ష్యం వీడటం లేదు. మార్కెట్లు, రహదారులపైకి వచ్చేటప్పుడు భౌతిక దూరం పాటించడం లేదు. మహమ్మారి ముప్పును మరిచి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో గురువారం కనిపించిన ఈ రద్దీ దృశ్యాలు నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. హిందూపురంలో వివిధ అవసరాల కోసం రోడ్లపైకి వచ్చిన జనం దూరం పాటించకుండా గుంపులుగా చేరారు. రాజమహేంద్రవరం మెయిన్రోడ్డులో జనసంద్రం జాతరను తలపించింది.
ఇలాగైతే కరోనాకు పండగే! - హిందూపురంలో గుంపులుగా జనం
కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతున్నా ప్రజలు నిర్లక్ష్యం వీడడంలేదు. హిందూపురంలో వివిధ అవసరాల కోసం రోడ్లపైకి వచ్చిన జనం దూరం పాటించకుండా గుంపులుగా చేరారు. ఇలాగైతే వైరస్ మరింత ఉద్ధృతంగా విస్తరించే అవకాశముందని పలువురు అభిప్రాయపడ్డారు.
![ఇలాగైతే కరోనాకు పండగే! people crowd in corona time in ananthapuram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8239164-554-8239164-1596163322359.jpg)
గుంపులు గుంపులుగా జనం