తెదేపా శ్రేణులపై ఏకపక్షంగా కేసులు నమోదు చేయడం అన్యాయమని తెదేపా ధర్మవరం నియోజకవర్గ బాధ్యుడు పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ నెల 24న అనంతపురం జిల్లా ముష్ఠికోవెల గ్రామంలో జరిగిన ఘటనపై తెదేపా శ్రేణులపై నమోదు చేసిన కేసు విషయమై చర్చించేందుకు శుక్రవారం సాయంత్రం చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్కు ఆయన వెళ్లారు. తనతో పాటు మరో తొమ్మిది మందిపై వైకాపా వారిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారని, తమ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించకపోవడం సరికాదని శ్రీరామ్ అన్నారు. బాధిత తెదేపా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తే వైకాపా వారు కవ్వింపు చర్యలకు దిగి, దాడులు చేసి తిరిగి తమపైనే కేసులు నమోదు చేయించటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. వైకాపా వారిపై కూడా కేసు నమోదు చేయాలని, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.
వైకాపా, తెదేపా కార్యకర్తల వాగ్యుద్దం