అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. స్థానిక నేతలు హోరాహోరీగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. శింగనమల, గార్లదిన్నె, నార్పల, బుక్కరాయసముద్రం, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో రేపు ఎన్నికల ప్రచారం ముగియనుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ నెల 17న పోలింగ్ జరగనుంది.
మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం.. జోరు పెంచిన అభ్యర్థులు - శింగనమల వార్తలు
ఈ నెల 17న మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది.
జోరు పెంచిన పార్టీలు