ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 19, 2020, 7:33 PM IST

ETV Bharat / state

అనంతలో నాలుగో ఆర్గానిక్‌ డిస్ ఇన్‌ఫెక్టెంట్‌ టన్నెల్ ఏర్పాటు

సోడియం హైపో క్లోరైడ్ ద్రావణంతో చర్మ సమస్యలు వస్తాయన్న సూచనల మేరకు.. అనంతపురంలో ఆర్గానిక్ డిస్​ఇన్ఫెక్షన్ టన్నెల్​ను ఏర్పాటు చేశారు.

organic-disinfectant-tunnels-are-used-in-ananthapuram-for-corona-virus
organic-disinfectant-tunnels-are-used-in-ananthapuram-for-corona-virus

కలెక్టర్ గంధం చంద్రుడితో ఈటీవీ భారత్​ ప్రతినిధి లక్ష్మీప్రసాద్​ ముఖాముఖి

అనంతపురం జిల్లాలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆర్గానిక్‌ డిస్ ఇన్‌ఫెక్షన్ టన్నెల్స్​ను ఏర్పాటు చేశారు. సోడియం హైపో క్లోరైడ్‌ రసాయనంతో చర్మ సంబంధిత ఇబ్బందులు తలెత్తుతున్న కారణంగా ఆర్గానిక్‌ డిస్ ఇన్‌ఫెక్టెంట్‌ టన్నెల్స్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో ఇవాళ నాలుగో టన్నెల్​ను కలెక్టర్‌ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఐదు కరోనా నిర్థరణ పరీక్షల ప్రయోగశాలలు అందుబాటులోకి వచ్చాయన్నారు. రోజూ 350 నమూనాలను పరీక్ష చేసే సామర్థ్యం ఉందంటున్న కలెక్టర్ గంధం చంద్రుడితో ఈటీవీ భారత్​ ప్రతినిధి లక్ష్మీప్రసాద్​ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details