ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 25, 2020, 2:35 AM IST

ETV Bharat / state

ఆటో-ద్విచక్రవాహనం ఢీ: ఒకరు మృతి

అనంతపురం జిల్లా మల్లయ్యగారిపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

one man death with a accident in ananthapuram district
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మస్తాన్​వలీ

అనంతపురం జిల్లా కదిరి మండలం మల్లయ్యగారిపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. కదిరికి చెందిన మస్తాన్ వలీ.. మల్లయ్యగారిపల్లిలో ఉన్న మామిడి తోటకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మస్తాన్ వలీ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కదిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని.. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details