ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేద ముస్లింలకు నిత్యసురభి చారిటబుల్ ట్రస్ట్ సహాయం

పవిత్రమైన రంజాన్ పండగను ప్రతి ముస్లిం సంతోషంగా జరుపుకోవాలని నిత్యసురభి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ డాక్టర్. నిర్మలమురళి కోరారు. అనంతపురంలోని ఆదర్శ నగర్​లోని ట్రస్టు కార్యాలయం వద్ద 20 వేలరూపాయలు విలువచేసే నిత్యావసర సరుకులను పేద కుటుంబాలకు అందించారు.

By

Published : May 13, 2021, 1:59 PM IST

 Nityasurabhi Charitable Trust
నిత్యసురభి చారిటబుల్ ట్రస్ట్

ప్రతి ఒక్కరు సేవాగుణం అలవర్చుకోవాలని నిత్యసురభి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ డాక్టర్. నిర్మలమురళి పిలుపునిచ్చారు. రంజాన్​ సందర్భంగా అనంతపురం ఆదర్శనగర్​లోని ట్రస్టు కార్యాలయం వద్ద 20 వేలరూపాయలు విలువచేసే నిత్యావసర సరుకులను పేద కుటుంబాలకు అందించారు. ఉన్నంతలో పేదలకు సహాయం చేయాలన్నారు. పవిత్రమైన రంజాన్ మాస ప్రార్థనల్లో.. కరోనా మహమ్మారి అంతమవ్వాలని.. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రతి ముస్లిం కోరుకోవాలని ఆమె తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details