ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారుణం: మహిళపై వ్యక్తి గొడ్డలితో దాడి..పరిస్థితి విషమం

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కొలిమిపాల్యం గ్రామంలో ఓ మహిళపై హత్యాయత్నం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

By

Published : Jul 14, 2020, 10:24 PM IST

murder attempt on women at kundurpi mandal ananthapram district
కుందుర్పి మండలంలో మహిళపై హత్యాయత్నం

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కొలిమిపాల్యంలో నిత్యావసరాల కోసం ఓ దుకాణానికి వచ్చిన మహిళపై హత్యాయత్నం జరిగింది. అదే గ్రామానికి చెందిన వ్యక్తి గొడ్డలితో దాడి చేసి ఆమెను హత్య చేసేందుకు యత్నించాడు.

తీవ్రంగా గాయపడి రక్తం మడుగులో పడి ఉన్న మహిళను హుటాహూటిన కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తరలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: ఆ నలుగురికి.. అమరావతి రైతుల లేఖలు!

ABOUT THE AUTHOR

...view details