polling: పెనుకొండ నగర పంచాయతీ ఎన్నిక.. పోలింగ్ ప్రారంభం - ananthapuram latest news
పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికలు ఉదయం ఏడు గంటలకే ప్రారంభమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
![polling: పెనుకొండ నగర పంచాయతీ ఎన్నిక.. పోలింగ్ ప్రారంభం ప్రారంభమైన పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13635555-511-13635555-1636942885861.jpg)
ప్రారంభమైన పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికలు
అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికలు ఉదయం ఏడు గంటలకే ప్రారంభమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా పోలీసులు పట్టణానికి 4 వైపులా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొత్తం 20,584 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో.. 10,214 మంది పురుషులు, 10,368 మంది మహిళలు, 2 ఇతరులు ఉన్నారు.