ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యానికి డబ్బులు లేక... చేనేత కార్మికుడు బలవన్మరణం

అనారోగ్యానికి గురైన చేనేత కార్మికుడు వైద్యం చేయించుకునేందుకు... డబ్బులు లేక ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది.

By

Published : Dec 3, 2020, 10:58 AM IST

Money for medical care or  handloom worker forced death at ananthapur district
వైద్యానికి డబ్బులు లేక...చేనేత కార్మికుడు బలవన్మరణం

అనంతపురం జిల్లా ధర్మవరంలో వైద్యానికి డబ్బులు లేక ఉరివేసుకొని చేనేత కార్మికుడు చిట్టా రామకృష్ణ మృతి చెందాడు. పట్టణంలోని శాంతినగర్​కు చెందిన రామకృష్ణ.. మగ్గం కార్మికుడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడ్డాడు. పని చేయలేక ఇంట్లోనే ఉన్నాడు. ఆర్థిక సమస్యలతో వైద్యం చేయించుకోలేకపోయాడు.

ఇంటి నుంచి బయటకు వెళ్లి రైల్వే గేట్​ వద్ద షెడ్డులో ఉన్న దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని రామకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details