ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హంద్రీనీవా సుజల స్రవంతి సొరంగం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే - krishna water taja news in

అనంతపురం జిల్లా కదిరి నియాజకవర్గంలో హంద్రీనీవా సుజల స్రవంతి సొరంగం, కాలువ పనులను స్థానిక ఎమ్మెల్యే సిద్దారెడ్డి పరిశీలించారు. నవంబర్ నాటికి పనులు పూర్తిచేసి కృష్ణాజలాలను తీసుకొస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

mla visits handriniva water works in annatpur dst
mla visits handriniva water works in annatpur dst

By

Published : Aug 10, 2020, 10:48 AM IST

అనంతపురం జిల్లా కదిరి నియాజకవర్గంలో జరుగుతున్న హంద్రీనీవా సుజల స్రవంతి సొరంగం, కాలువ పనులను ఎమ్మెల్యే సిద్దారెడ్డి పరిశీలించారు. తలుపుల మండలంలోని సొరంగం పనులు ఆలస్యం కావటంతో కాలువ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. అధికారులతో కలిసి ఎమ్మెల్యే కదిరి మండలం పట్నం నుంచి తలుపుల మండలం సబ్బనగుంతపల్లి వరకు కాలువ, వంతెన, సొరంగం పనులు పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి నవంబర్ నాటికి కృష్ణా జలాలను తీసుకొస్తామని ఎమ్మెల్యే చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details