ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తా: ఎమ్మెల్యే శ్రీ చరణ్ - mla usha sri charan latest news update

సగంలో ఆగిపోయిన కాలువ పనులను పూర్తి చేయించి.. చాపిరి చెరువుకు నీరు తీసుకొచ్చి కళ్యాణదుర్గంలో తాగునీటి అవసరాలను తీరుస్తామని ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ పేర్కొన్నారు. టమాటా రైతుల కోసం జ్యూస్​ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయానున్నట్లు వెల్లడించారు.

mla usha sri charan comments
నియోజకవర్గంలో పలు అంశాలపై మాట్లాడిన ఎమ్మెల్యే ఉష శ్రీ ఛరణ్​

By

Published : Jul 16, 2020, 3:22 PM IST

నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ స్పష్టం చేశారు. ఇప్పటికే హామీ ఇచ్చిన మేరకు బీటీపీ ప్రాజెక్టును నీటితో నింపి, అన్ని చెరువులు కృష్ణా జలాలతో నింపేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడానట్లు తెలిపారు.

ఇందుకోసం రైతులతో చేపట్టిన భూసేకరణకు సంబంధించి నష్టపరిహారం మొత్తాన్ని వారి ఖాతాల్లోకి జమ చేస్తామని తెలిపారు. అలాగే... రైతులు పండించే టమాటాను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు జ్యూస్ ఫ్యాక్టరీ నెలకొల్పనున్నట్టు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details