ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం' - ఇళ్ల స్థలాల పంపిణీ పై ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సమీక్ష

కదిరి మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఇళ్ల స్థలాల పంపిణీపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఎమ్మెల్యే  సమీక్ష
ఎమ్మెల్యే సమీక్ష

By

Published : Dec 22, 2020, 7:45 PM IST

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లాలోని కదిరి మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఇళ్ల స్థలాల పంపిణీపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈనెల 25వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులందరికీ లే అవుట్‌లలో స్థలం చూపే పట్టాలు ఇస్తామన్నారు.

సమీక్ష అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్​రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి.. పూలమాల వేశారు.

ABOUT THE AUTHOR

...view details