ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జాగ్రత్తలు పాటించండి... కరోనాను దరి చేరనీయకండి' - మంత్రి శంకరనారాయణ లేటెస్ట్ వార్తలు

కరోనా కట్టడికై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని మంత్రి శంకరనారాయణ అన్నారు. పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో కరోనా నివారణపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

minister shankar narayana
'జాగ్రత్తలు పాటించండి...కరోనాను దరిచేరనీయకండి'

By

Published : Jul 19, 2020, 6:39 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో కరోనా కట్టడిపై అధికారులు, వైద్యులు, పోలీసులతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. కొవిడ్-19 కట్టడి చేయడంలో దేశంలోనే రాష్ట్రం ముందు స్థానంలో ఉందన్నారు.

కరోనా వ్యాధి విషయంలో చికిత్స కన్నా నివారణ ముఖ్యమన్నారు. సామాజిక దూరం పాటిస్తూ వ్యక్తిగత శుభ్రతతో వైరస్​ను తమ దరి చేరకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. వాలంటీర్లు, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారని ప్రశంసించారు.

ABOUT THE AUTHOR

...view details