ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 30, 2020, 7:51 PM IST

ETV Bharat / state

'సామాజిక దూరమే మనల్ని కాపాడుతుంది'

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారని మంత్రి శంకర్​నారాయణ చెప్పారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని మార్కెట్​ను ఆయన పరిశీలించారు.

Minister  shankar narayana inspected the vegetable market at uravakonda
ఉరవకొండలోని మార్కెట్​ను పరిశీలించిన శంకర్​నారయణ

ఉరవకొండలోని మార్కెట్​ను పరిశీలించిన శంకర్​నారయణ

సామాజిక దూరాన్ని స్వచ్ఛందంగా పాటించాలని మంత్రి శంకర్ నారాయణ ప్రజలను కోరారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో గ్రామ సచివాలయం వద్ద హైడ్రో క్లోరైడ్ ద్రావకాన్ని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో కలిసి మంత్రి పిచికారీ చేయించారు. కొంత మందికి మాస్కులు పంపిణీ చేశారు. సామాజిక దూరాన్ని పాటించాలని ప్రజలకు సూచించారు. రేషన్ షాపులను తనిఖీ చేసి సరుకులు పంపిణీ చేశారు. బాలయోగి గురుకుల పాఠశాలలో క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించారు. అన్ని సదుపాయాలను కల్పించాలని వైద్య అధికారులకు సూచించారు. ప్రభుత్వ మైదానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయలు, పండ్ల మార్కెట్ ను సందర్శించారు. అనంతరం కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై అధికారులతో సమీక్షించారు.

ABOUT THE AUTHOR

...view details