ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నెలాఖరులోగా పరిగి చెరువుకు నీరందిస్తాం' - anantapur district news

రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని... మంత్రి శంకర్​ నారాయణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

శంకర్ నారాయణ

By

Published : Aug 31, 2019, 11:58 PM IST

శంకర్ నారాయణ

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ అనంతపురం జిల్లాలోని పెనుకొండ, హిందూపురం నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పరిగి మండలం కొడిగెనహళ్లిలో బ్రాహ్మణ, ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాల సంక్షేమానికి పలు పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. పరిశ్రమల్లో 70శాతం స్థానికులకే ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చట్టం తీసుకొచ్చారని పేర్కొన్నారు. వచ్చే నెలాఖరులోగా పరిగి చెరువుకు నీరందిస్తామని చెప్పారు. లేపాక్షి మండలం సిరివరంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్​స్టేషన్​ను ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details