ఇచ్చిన హామీలను సీఎం నెరవేరుస్తున్నారని మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. అనంతపురంలో రేషన్ సరుకులను ఇంటింటికి సరఫరా చేసే ప్రత్యేక వాహనాలను ఆయన ప్రారంభించారు. జిల్లాపాలనాధికారి గంధం చంద్రుడు, స్థానిక ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటివద్దకే రేషన్ ఇచ్చే వ్యవస్థను తొలిసారిగా సీఎం జగన్ ప్రవేశపెట్టారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 754 వాహనాల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామని వివరించారు.
రాయితీపై వాహనాలు..