ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్దిని చూసి ఓర్వలేకే మతకలహాలు: మంత్రి బొత్స - మంత్రి బొత్స తాజా వార్తలు

రాష్ట్రంలో అభివృద్దిని చూసి ఓర్వలేకనే మతకలహాలు సృష్టిస్తున్నారని మంత్రి బొత్స ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ నెరవేరుస్తున్నారని వ్యాఖ్యానించారు.

అభివృద్దిని చూసి ఓర్వలేకనే మతకలహాలు
అభివృద్దిని చూసి ఓర్వలేకనే మతకలహాలు

By

Published : Jan 18, 2021, 5:50 PM IST

ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలన్నీ సీఎం జగన్ నెరవేరుస్తున్నారని అనంతపురం జిల్లా ఇన్​ఛార్జి మంత్రి బొత్స సత్యనారాణ అన్నారు. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో లబ్దిదారులకు ఆయన ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో అభివృద్దిని చూసి ఓర్వలేకనే మతకలహాలు సృష్టిస్తున్నారని బొత్స ఆరోపించారు. ప్రభుత్వం తరఫున సంక్షేమ ఫలాలు పొందుతున్న తెలుగుదేశం సానుభూతిపరులు సైతం... వైకాపాకే మద్దతు తెలుపుతున్నారని మంత్రి శంకరనారాయణ వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details