ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంఐఎంను గెలిపిస్తే.. ఎన్నార్సీ, ఎన్​పీఆర్​పై పోరాటం: అసదుద్దీన్ - ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తాజా వార్తలు

ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ... అనంతపురం జిల్లా హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అధికార, విపక్షాలపై విమర్శలు గుప్పించిన ఆయన మైనార్టీలను గెలిపిస్తే ఎన్నార్సీ, ఎన్​పీఆర్లపై పోరాటం సాధ్యపడుతుందన్నారు.

Asaduddin Owaisi muncipal elections campaign
ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం

By

Published : Mar 7, 2021, 10:56 AM IST

Updated : Mar 7, 2021, 12:36 PM IST

అనంతపురం జిల్లా హిందూపురంలో తెలంగాణలోని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అధికార, విపక్ష పార్టీలను తీవ్రస్థాయిలో విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురం వచ్చిన ఆయన మున్సిపల్ ఎన్నికల్లో 9వ వార్డులోని ఎంఐఎం పార్టీ అభ్యర్థులను గెలిపించి తమ సత్తా ఏంటో చూపించాలని పిలుపునిచ్చారు.

మైనార్టీలను కాపాడేది ఎంఐఎం పార్టీయే అని స్పష్టం చేశారు. భాజపాను అడ్డుకోకపోతే భవిష్యత్ ప్రమాదకరంగా మారుతుందని ప్రజలను హెచ్చరించారు. ఎన్నార్సీ, ఎన్​పీఆర్ లపై ప్రభుత్వం వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

Last Updated : Mar 7, 2021, 12:36 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details